కార్బెట్ నేషనల్ పార్క్ కి గేటు వే గా పిలువబడే నగరం రాంనగర్. నైనిటాల్ డిస్ట్రిక్ట్ కి మునిసిపల్ బోర్డు గా ఇది వ్యవహరిస్తోంది. 1856 నుండి 1884 మధ్యలో ఈ ప్రాంతం H. రాంసే చే ఏర్పాటు చేయబడింది. మహాభారత కాలం లో ఉత్తర పాంచాల కి రాజధానిగా వ్యవహరించిన ఈ ప్రాంతం అహిఛత్ర గా ఇంతకు పూర్వం పిలువబడేది.
పశ్చిమ కుమోన్ కు ప్రవేశ కేంద్రం గా ఈ నగరం వ్యవహరిస్తుంది. బ్రిటిష్ కాలం లో అభివృద్ధి పరచబడిన పురాతన తేయాకు తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ది. అంతే కాకుండా, లిచీ సాగు తో రాంనగర్ ప్రాంతం ప్రపంచ ఖ్యాతి పొందింది. పర్యాటకులు బస చేయడానికి ఎన్నో లాడ్జ్ లు అలాగే హోటల్స్ అందుబాటులో కలవు.