పిఛావరం మడ అడవులు ఈ ప్రాంతంలోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రపంచంలోని అడవులలో ఈ మడఅడవి పెద్దదే కాక, ఆరోగ్యకరమైన వానిలో ఒకటి కూడా. ఇది చిదంబరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నీటిలో ఉన్న అనేక దీవులు వందల రకాల స్థానిక, వలస పక్షులకు నివాసాలు. ఇక్కడ ఉన్న వానిలో వాటర్నిప్స్ , నారాయణ పక్షులు, గూడబాతులు, నీటికాకులు మరియు ఎగ్రెట్స్ కొన్ని. ఈ అడవులు ప్రపంచవ్యాప్తంగా పక్షులను తిలకించే వారిని సెప్టెంబర్, ఏప్రిల్ నెలలు, నవంబర్, జనవరి నెలలలో ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఈ ప్రాంత ఆకర్షణను ఇనుమడించే బోటింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది.