భుల్వాని మాతా అని కూడా పిలువబడే బారా పతేర్, కాలతోప్ మరియు అలహా గ్రామం మధ్య, దయన్ కుండ్ శిఖరం పాదాల వద్ద ఉంది. ప్రతి సంవత్సరం, జూలై నెలలో, దేవత భుల్వాని మాతా గౌరవార్ధం నిర్వహించబడే భారీ ఉత్సవం, సుదూర ప్రాంతాల నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ 150 సంవత్సరాల ఆలయం, మధ్యయుగ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తూ ఉండటం వల్ల, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. డల్హౌసీ నుండి 4 కి.మీ.ల దూరంలో ఉన్న బారా పతే కు చేరుకోవటానికి, యాత్రికులకు టాక్సీలు సులభంగా లభిస్తాయి. దట్టమైన అడవులు గుండా పోయే ఈ ప్రాంతంలో సాహస ప్రేమికులు ట్రెక్ చేయవచ్చు.