భర్మౌర్, చంబా నుండి 60 కి.మీ ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం. ఒకప్పుడు చంబా రాజధానిగా ఉన్నఈ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ కి చెందిన గడ్డి తెగల చే ఆక్రమించబడింది. యాత్రికులు, ఇక్కడి అత్యద్భుతమైన అందం తో పాటు పర్వతాలు మరియు దేవాలయాల విస్తృత దృశ్యాలు కూడా అనుభవించవచ్చు. ఈ ప్రదేశం తాజా పండ్లు మరియు దుప్పట్లకు కూడా పేరుగాంచింది. 1000 సంవత్సరాలకు పైగా పురాతన ఆలయాలు ఈ ప్రాంతం యొక్క ఆకర్షణను అధికం చేస్తున్నాయి. లక్షణ దేవి మరియు గణేష్ అనే రెండు ఆలయాలు, వాటి నిర్మాణ శైలులకై ప్రసిద్ధి చెందాయి. 4 కి.మీ ల ట్రెక్ ద్వారా చేరగలిగే చౌరాసి ఆలయం కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది. మనిమహేష్ యాత్ర ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల మధ్య సమయంలో నిర్వహించబడుతుంది. సందర్శకులు 35 కి.మీ.ల ఎత్తుపైకి అధిరోహించి మనిమహేష్ సరస్సు యొక్క పవిత్ర జలాల్లో మునుకలేస్తారు. భర్మౌర్, పర్వతారోహణ వంటి కష్టరమైన క్రీడల పట్ల ఉత్సాహం చూపించే సాహస ప్రేమికులకు ఒక అద్భుతమైన స్థావరంగా పనిచేస్తుంది. పర్వతారోహణ ప్రాంతీయ కేంద్రం మనాలి లో ఉంది. పర్యాటకులు ఏప్రిల్ మరియు అక్టోబర్ మధ్య నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించాల్సిందిగా సూచిస్తారు.