కలతోప్ ఖజ్జియర్ అభయారణ్యం అని కూడా పిలవబడే కలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం, డల్హౌసీ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన దేవదారు చెట్లతో నిండి 1962 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం, హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా లో భాగం.ఈ ప్రదేశంలో ప్రధానంగా నీలం దేవదారు, ఫర్ మరియు దేవదారు చెట్లు ఉన్నాయి.
వివిధ జాతుల జంతువులు మరియు పక్షులు గల, ఈ అభయారణ్యం, రాష్ట్రం లోని ప్రసిద్ధ పర్యాటక గమ్యంగా భావిస్తారు. అభయారణ్యం చిరుతపులులు, ఎలుగుబంటి, జింక, ఉడుత, మొరిగే గోరల్, సేరో, కోతి, నక్క మరియు నల్లని హిమాలయ మార్టెన్ కి నివాసంగా ఉంది. భారీ పక్షుల గుంపులకు నెలవయిన ఈ అభయారణ్యం, పక్షిశాస్త్రవేత్తలకు కనువిందు చేస్తుంది. చివరికి ఉత్తరాన రావి నది లో లీనమయ్యే ఒక అందమైన వాగు, అభయారణ్యం మధ్యలోంచి ప్రవహిస్తుంది. సందర్శకులకు ఈ ప్రాంతం మొత్తం తిరగడానికి కనీసం 3 నుండి 6 గంటల సమయం అవసరం. అభయారణ్యం లోని రహదారులు చక్కగా నిర్వహించబడి ఉన్నాయి, అందువల్ల, ఇక్కడ వాహ్యాళి సందర్శకులలో ఆదరణ పొందింది. చంబా జిల్లా అటవీ అధికారి ప్రత్యేక అనుమతి తో మాత్రమే అభయారణ్యం లోపలకి వాహనాల ప్రవేశం అనుమతించబడుతుంది. ఈ స్థలం సందర్శించడానికి అనువైన సమయం మార్చి - మే నెలల మధ్య మరియు సెప్టెంబరు - నవంబరు నెలల మధ్య కాలం.