కైనన్స్ ని 1933 లో లాహోర్ డాక్టర్ ఎన్.ఆర్ ధరమ్ వీర్ నిర్మించారు. మొదట్లో నివాస భవనం గా ఉన్న ఈ కట్టడం, ఇప్పుడు డల్హౌసీ లోనే ప్రముఖ సాంప్రదాయ ప్రదేశాలలో ఒకటి. ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఒకసారి అనారోగ్యం నుండి కోలుకుంటూ, భవన యజమానులు ధరమ్ వీరులతో 7 నెలలకు పైగా కలిసి ఉన్నారు.
ఈ భవనాన్ని గుర్తించడం కష్టం, సాధారణంగా పర్యాటకులు దీని ఉనికిని గుర్తించడంలో విఫలమవుతారు. జాగ్రత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రమే కనుగొనగలరు. ఈ ప్రదేశాన్నిగుర్తించటానికి సులభమైన మార్గం, చెట్టుకు వేలాడే "కైనన్స్" సూచన ఫలకం. ఈ ప్రాంతం, గాంధీ చౌక్ నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. కాలినడకన సులభంగా చేరుకోవచ్చు.