10 వ శతాబ్దంలో నిర్మించబడిన లక్ష్మీ నారాయణ ఆలయం, చంబా ప్రాంతంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం క్రీ.శ. 920 మరియు 940 ల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు సాహిల్ వర్మన్ నిర్మించారు. ఆలయ కట్టడం, శిఖర నిర్మాణ శైలిని చూపుతుంది. హిందూ మత సంరక్షణ దైవం విష్ణువు మరియు వినాశన దైవం శివునికి అంకితం చేయబడిన ఆరు మందిరాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఆలయం లోని ప్రధాన విగ్రహం విష్ణువుది. ఇది పలచని పాలరాయితో తయారు చేయబడటం వల్ల మినుకుమినుకుమని మెరుస్తూ ఉంటుంది. ప్రధాన విగ్రహం కాకుండా, హిందూ దేవతలు గౌరీ శంకర్, రాధా మరియు కృష్ణ కు అంకితం చేయబడిన అనేక ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి.