కైంత్ వాలీ కోఠి, తపో భూమి, పరమ్ ధామ్ మరియు రామ్ ఆశ్రమం వంటి అనేక పేర్లతో పిలివబడే నార్వుడ్ పరంధాం, డల్హౌసీ పట్టణం యొక్క బక్రోట కొండపై ఉంది. గురు ఈ ఇంట్లో ఉండి మతం మరియు సామాజిక సంస్కృతి గురించి బోధించారని నమ్ముతారు. జ్ఞానోదయం పొందడానికి, స్వామి సత్యానంద్, 1925 లో తన డల్హౌసీ ప్రయాణంలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ దాదాపు ఒక నెల ఉపవాస దీక్ష చేసారు. అతను ఇక్కడ నివసించే సమయంలో అనేక మత గ్రంథాలను రచించాడు. స్వామి సత్యానంద్ 1960 లో తన తుది శ్వాస విడిచారు. అప్పటినించి ఈ స్థలం పరమ్ ధామ్ అనే పేరు తో పిలవబడుతూ వచ్చింది. ఈ మందిరం ఇప్పుడు స్వామి సత్యానంద్ మార్గాన్ని అనుసరిస్తున్న భగత్ హన్స్ రాజ్ జీ ఆధ్వర్యం లో ఉంది. అతను ఇక్కడ నియమిత సమయాల్లో సత్సంగ్ మరియు అర్ధ-వార్షిక సమావేశాలు నిర్వహిస్తారు.
ఈ సమయంలో అనేక మంది భక్తులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. ఈ భవనం, ఒకే సమయంలో 250 మందిని సౌకర్యవంతంగా ఇముడ్చుకునే సామర్ధ్యం కలిగి ఉంది. పర్యాటకులు, గాంధీ చౌక్ నుండి 5 కి.మీ. ల దూరం ప్రయాణించి ఈ స్థలం చేరుకోవచ్చు.