సురానా మొహల్లా లో రాజా ఉమేద్ సింగ్ నిర్మించిన రంగ్ మహల్, మొఘల్ మరియు బ్రిటీష్ శైలుల యొక్క నిర్మాణ మిశ్రమం వివరిస్తుంది. ఈ స్థలం యొక్క ప్రధాన ఆకర్షణలలో, కృష్ణుడి జీవితాన్ని వివరించే 18 వ శతాబ్దపు పంజాబి పర్వత శైలి కుడ్యచిత్రాలు ఉన్నాయి.
మ్యూజియం లో మునుపు ప్రదర్శించబడ్డ ఇతర అందమైన మరియు అలంకరణ కుడ్యచిత్రాలును ఇక్కడి నించి తొలగించి ఢిల్లీ జాతీయ మ్యూజియం వద్ద ఉంచారు. సందర్శకులు మ్యూజియం లోపల ఉన్న చేనేత రుమాళ్ళు, చెక్క మగ్గం తయారీ శాలువాలు మరియు హిమాచల్ ఎంపోరియం నుండి చెప్పులు కొనుగోలు చేయవచ్చు. ఈ దుకాణం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 నుండి 1 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.