1909 సంవత్సరంలో నిర్మితమయిన సెయింట్ పాట్రిక్స్ చర్చి, డల్హౌసీ సేనాస్థావరం పరిధిలో, బాలున్ జలపాతం వద్ద ఉంది. ఈ చర్చి స్థాపన ముఖ్యంగా బ్రిటిష్ సైన్యాధికారులను వల్లే జరిగింది. ఇది ఈ ప్రాంతం యొక్క అతిపెద్ద చర్చి. ప్రధాన చావడి లో 300 కంటే ఎక్కువ మంది ప్రజలను ఇముడ్చుకునే సామర్ధ్యము ఉంది. సెయింట్ పాట్రిక్స్ చర్చి, జలంధర్ కాథలిక్ అధికారపరిధి లో నిర్వహించబడుతోంది. భక్తులు మరియు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చర్చికి వార సేవ కోసం ఆదివారం చేరుకుంటారు. యాత్రికులు డల్హౌసీ బస్టాండు నుండి 2 కి.మీ.ల దూరం ప్రయాణించి, ఈ స్థలం చేరుకోవచ్చు.