దంతా ఒకప్పుడు అగ్నివంశ రాజపుత్రుల వారసులయిన పారమార రాజవంశం యొక్క రాచరిక రాష్ట్రంగా ఉంది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, దంతా భారతదేశంలో విలీనమైంది. దంతా రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో బనస్కంట జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ నుండి అహ్మదాబాద్ కు దక్షిణాన 161 కి.మీ.ల దూరంలో ఉంది. ఇప్పటికీ ఈ స్థలంలో రాజ కుటుంబ సభ్యులు నివసిస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి పూజ, దంతా మహారాణా చేతుల మీదుగా జరుగుతుంది. రాజస్థాన్ లోని అబూ పర్వతానికి దగ్గరగా, దంతా రాజ కుటుంబం "భవాని విల్లా సాంప్రదాయ గృహ బస" నడుపుతుంది.
దంతా పరిసరాలలో సందర్శించడానికి స్థలాలు: అంబాజీ గుడి, పటాన్ లో రాణి కి వావ్, జైన దేవాలయం అవశేషాలు, వాద్నగర్ వద్ద స్మారక చిహ్నాలు, కోటేశ్వర ఆలయం, మొదెర సూర్య దేవాలయం, తరంగ మరియు కుంభారియా జైన్ ఆలయాలు మరియు ధరోయ్ ఆనకట్ట. పష్మినా ఉత్తరీయాలు, ఇత్తడి ఆభరణాలు, ఏనుగు దంతపు చిత్రాలు వంటి అందమైన వస్తువులు ఇక్కడ చూడవచ్చు. బలరాం అంబాజీ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నీలం ఎద్దులు వంటి జంతువులు, అడవి కోడి మరియు చీలిక కోడి వంటి పక్షులు, కౌజులు, నెమళ్లు, కోలంకిపిట్టలు మరియు అడవి పంది, నక్క, గుంట నక్క వంటి క్రూర జంతువులు, అడవి పిల్లి, దుమ్ములగొండి, చిరుత, ఎలుగుబంటి & ముళ్ళ పంది వంటి వివిధ జాతులు ఈ కేంద్రంలో కనిపిస్తాయి.