మహావీర్, నేమినాథ్, సంభవ్ నాథ్, శాంతినాథ్ మరియు పర్ష్వ నాథ్ అనే ఐదుగురు జైన తీర్థంకరులకు అంకితం చేస్తూ 12 వ శతాబ్దంలో విమల్ షా నిర్మించిన ఐదు దేవాలయాలను కుంభారియా జైన్ ఆలయాలు అంటారు. చాళుక్య రాజు భీమదేవ్ I మంత్రి విమల్ షా నిర్మించిన 360 జైన్ ఆలయాలకు గానూ కేవలం ఈ ఐదు ఆలయాలు మాత్రమే మిగిలాయి.
ఇవి పాలరాతితో కళాత్మకంగా నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలు తరంగ కొండల నుండి 40 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు, గుర్రపు రౌతులు మరియు సంగీతకారుల విస్తృతమైన కళాత్మక చెక్కడాలు ఇక్కడ చూడవచ్చు. దేవాలయాలు రొజూ ఉదయం 6.30 మరియు సాయంత్రం 7.30 మధ్య తెరిచి ఉంటాయి.