దరాసురం, ఇక్కడ ఉన్న ఐరావతేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం. తంజావూర్ లో ఉన్న గొప్ప మత ప్రాధాన్యత ఉన్న ఇంకొక పట్టణానికి ఈ దేవాలయం చాలా సమీపంలో ఉన్నది. దరాసురం, రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నుండి 380 కి. మీ.దూరంలో ఉన్నది. దీనిని రాజరాజపురం అని కూడా పిలుస్తారు, దీని జనాభా 2001 సంవత్సరం నాటికి 15,000.దేవాలయ నిర్మాణం ఒక నిధి వంటిది
దరాసురంలోని మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలుదరాసురం యొక్క ప్రధమ ఆకర్షణ ఐరావతేశ్వర దేవాలయం. దీనిని చోళ రాజుల కాలంలో, రాజరాజచోళ II కట్టించారు. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కట్టించారు మరియు ఈ తమిళ దేవాలయ నిర్మాణం ఒక గర్వకారణంగా నిలిచింది. ఈ దేవాలయాన్ని UNESCO ఒక ప్రపంచ వారసత్వ స్మారక కట్టడంగా గుర్తించింది. ఈ దేవాలయం తాన్జోర్కు 35 కి. మీ. దూరంలో ఉన్నది, తాన్జోర్ నుండి ఇక్కడికి చేరుకోవటం చాలా సులభం. తాన్జోర్ మరియు దరాసురం లోని ఆలయ నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటాయి, ఎందుకంటే ఈ రెండు దేవాలయాలను చోళ రాజ్యం నాటి రాజులే కట్టించారు.
దరాసురం వాతావరణం దరాసురంలో వాతావరణం ఉష్ణముగా ఉంటుంది మరియు ఈ పట్టణంలో చాలా సూర్యరశ్మి ఉంటుంది. ఫలితంగా, ఇక్కడ ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి. సంవత్సరమంతా విపరీతమైన వేడి మరియు గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది మరియు వేసవిలో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది. అందువలన దరాసురం సందర్శించినప్పుడు నూలు దుస్తులు తీసుకెళ్లటం మంచిది.
దరాసురం ఎలా వెళ్ళాలి?కుంబకోణం నుండి బస్సు మరియు రైల్ ద్వారా దరాసురం సులభంగా చేరుకోవొచ్చు. ఈ పట్టణంలో రైల్వే స్టేషన్ ఉన్నది, ఇక్కడనుండి ప్రతి రోజు కుంబకోణం మరియు తాన్జోర్ కు రైళ్ళు ఉన్నాయి.