ఇది కుంబకోణం పట్టణం నుండి 8 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ గ్రామానికి, కామధేను యొక్క దూడ, పట్టి, పేరు పెట్టారు. ఇక్కడ కామధేను యొక్క దూడ, పట్టి, ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడని, అందుకే దీనికి ఈ పేరు వొచ్చిందని పురాణాలు చెపుతున్నాయి. ఈ గ్రామం దుర్గామాత దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయ నిర్మాణం పల్లవ, చోళ మరియు నాయక్ శైలిలో ఉన్నది. అందువలన, ఈ దేవాలయం కట్టించిన తరువాత, మరల చాలాసార్లు తిరిగి కట్టటం జరిగిందని నమ్ముతారు. రాముడు, రావణుడిని చంపిన తరువాత, ఆ పాపం పోవటానికి ఇక్కడకు వోచ్చాడని, మూడు శివలింగాలను ప్రతిష్టించాడని కూడా నమ్ముతారు. ఈ శివలింగాలకు అభిషేకం చేయటానికి ఒక బావిని కూడా సృష్టించాడని కూడా నమ్ముతారు. ఈ ప్రదేశానికి కుడి వైపు ఉన్న ధనుష్కోడి నీరు ఈ బావికి తెచ్చారని కూడా నమ్ముతారు. దరాసురం వలన్గిమన్ రోడ్ తో పాటుగా దరాసురం నుండి 3 కి. మీ. దూరంలో పట్టేస్వరం ఉన్నది. ఇక్కడికి, కుంబకోణం మరియు దరాసురం నుండి బస్సు సర్వీస్ ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.