పజ్హయరై, దీనిని గొప్ప చోళ రాజ్యం యొక్క పూర్వ రాజధాని నమ్ముతారు. ఇక్కడ చోళ రాజుల కాలంనాటి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనవి పజ్హైయరై సోమేస్వరార్ ఆలయం, దీనినే పజ్హయరై వదతలి అని కూడా పిలుస్తారు. ఇది కుంబకోణం నుండి సుమారుగా 6 కి. మీ. దూరంలో ఉన్నది మరియు దరాసురం కు అతిసమీపంలో ఉన్నది. దరాసురం నుండి కేవలం 3 కి. మీ. అవతల ఉన్నది. ఈ ఆలయం తప్పనిసరిగా దర్శించవలసిన ప్రముఖ పుణ్యస్థలం. దరాసురం రైల్వే స్టేషన్ కు చాలా సమీపంలో ఉన్నది.పజ్హయరై లో ఉన్న నాలుగు పురాతనమైన ఆలయాలలో 'పజ్హయరై వదతలి' ఒకటి, మిగతా మూడు దేవాలయాల పేర్లు 'మెత్రాలి', 'కేల్తలి' మరియు 'తేన్తలి'. నిర్మాణ శైలిలో వేటికవే సాటిగా ఉన్నాయి.