ఆగ్రాసేన్ బోలి న్యూ ఢిల్లీ లో గల ఒక అపూర్వ స్మారకచిహ్నము. నవ నాగరిక చిహ్నాలైన ఎత్తైన భవన సముదాయాల మధ్య ఉన్న ఈ చార్త్రాత్మక కట్టడం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆగ్రాసేన్ బోలి ని పురావస్తు శాఖ పరిరక్షిస్తోంది.హెయిలీ రోద్దు మీద కానాట్ ప్లేస్ కి దగ్గరలో గల ఈ కట్టడం 15 మీటర్ల వెడల్పు 60 మీటర్ల పొడవుతో ఉంటుంది.
ఈ కట్టడాన్ని మొట్టమొదట ప్రారంభించినది ఎవరో సరిగ్గా తెలియకపోయినా చరిత్రకారుల ప్రకారం దీనిని మహాభారత కాలం నాటి అగ్రసేనుడు కట్టించాడని ఆ తరువాత అగర్వాల్ వంశస్తులు 14 వ శతాబ్దం లో దీనిని పునర్నిర్మిచారని తెలుస్తోంది. 103 మెట్లు గల ఈ దిగుడు బావి లో ఒకప్పుడు ఐదు అంతస్తులలో నీరు నిలువ ఉండేది.
వ్రుత్తాకార మెట్లు గల సంప్రదాయ బావుల వలే కాకుండా ఈ బావి మెట్లు ఒక పక్క కాస్త పైకి లేచి చూరుతో వుంటే మరొక పక్క చూరు లేకుండా వేప చెట్టు నీడతో కప్పబడి ఉంటాయి.ఇప్పుడు ఈ బావిలో నీరు లేదు కానీ పావురాలు, గబ్బిలాలకి మాత్రం ఆవాసయోగ్యమయ్యింది.
ఈ కట్టడం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యం లో 1958 నాటి చట్టం పురావస్తు కట్టడాలు మరియు శిధిల చారిత్రక కట్టడాల చట్టం ప్రకారం పరిరక్షించబడుతోంది.