స్వాంతంత్ర్య సమర యోధుడు శ్రీ సుభాష్ చంద్ర బోస్ గౌరవార్ధం డిల్లీ పర్యాటక శాఖ వారు ఆజాద్ హింద్ గ్రామ్ పర్యాటక సముదాయాన్ని నిర్మించారు. దేశం విడిచి వెళ్ళే ముందు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇక్కడే సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.
డిల్లీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో డిల్లీ- హర్యానా సరిహద్దు మీద 10వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ స్మారకం వుంది. సంప్రదాయ పనితనంతో ఈ నిర్మాణాన్ని ఉత్తర భారత నిర్మాణ శైలిలో కట్టారు.కోల్కతా కు చెందిన కొందరు కళాకారులు నిర్మించిన ఈ కట్టడం వివిధ చిత్రాల ద్వారా నేతాజీ హావభావాలను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనశాలలో కాన్వాస్ మీద చిత్రించిన స్వాతంత్రోద్యమానికి చెందిన కొన్ని ప్రధాన ఘట్టాలు కూడా వున్నాయి.
పెద్ద మొజాయిక్ గోపురాలు, ప్రదర్శనశాల ఈ సముదాయం అంతటి లోకి ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రదర్శనశాలలో (డిల్లీ చలో) చాలా పత్రికా ప్రకటనలు, స్వాతంత్ర సంగ్రామానికి చెందిన ఇతర దృశ్య ప్రస్తావనలతో పాటు భారత జాతీయ సైన్యం లోని దళాలను చూపించే చిత్రాలు కూడా వున్నాయి.
ఒక అంఫిథియేటర్, భోజన శాలలు, ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్, ఒక కానుకల దుకాణం, ఉద్యాన దుకాణం, ఒక సమాచార కేంద్రం ఇక్కడి ఇతర ఆకర్షణల్లో కొన్ని. ఇది వారంలోని అన్ని రోజుల్లో తెరిచే వుండి, జాతీయ శెలవు దినాల్లో మూసి వుంటుంది. ఈ సముదాయం ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా తెరిచే వుంటుంది.