1986 లో నిర్మించిన దగ్గర నుండీ ఈ ప్రదేశాన్ని సందర్శకులు తప్పక దర్శించ వలసిన స్థలం గా గుర్తించారు. ఈ స్థలం "లోటస్ టెంపుల్" గా పిలవబడుతూ ఏటా 40 లక్షల సందర్శకులకి కనువిందు చేస్తోంది.
బహాపూర్ అనే చిన్న గ్రామం లో గల ఈ గుడి ఢిల్లీ సందర్శకులకి ఒక అక్కర్షణీయ స్థలమయ్యింది. దీని శిల్ప కళా వైభవానికి ఎన్ని అభినందనలో.ఈ శిల్ప కళా వైభవాన్ని టీవీ లోనో, లేక దర్శనీయ స్థల పుస్తకాలలో కాకుండా స్వయం గా చూసి తీరవలసినదే.ఈ సుందర కట్టడానికి లెక్కకు మించిన అవార్డులు వచ్చాయి.
మిగతా అన్ని "బహాయీ" గుడుల వలే ఈ గుడిలోనికి కూడా "బహాయి " గ్రంధాలలో వక్కాణించినట్లు అన్ని మతాల వారికీ ప్రవేశం కల్పిస్తోంది.అన్ని మతాల వారూ ప్రార్ధించడానికి అనుమతించిననూ ఇక్కడ ఎవ్వరూ తమ మత ప్రవచనాలను ప్రవచించుట కానీ,తమ మతానికి సంబంధించిన కర్మలను ఆచరించుట కానీ అనుమతించరు.
ఈ ప్రదెశం గురించి మరి కొంచం వివరాలు:అసలు ఈ అధ్భుత "లోటస్ టెంపుల్ " కట్టడం వెనక గల కారణాన్ని తెలుసుకుందాము."బహాయీ" శిల్ప కళ ప్రకారం అబ్దుల్ బహా అనే అతను "భాయీ" మత వ్యస్థాపకుడు "బహాఉల్లా" కి కొడుకుబహాఉల్లా ప్రకారం ఒక ప్రార్ధనా స్థలం తొమ్మిది వ్రుత్తాకార భుజాలతో,విగ్రహాలు,చిత్ర పటాలు ప్రదర్శన కి ఉంచకుండా,ఎటువంటి హోమ,అగ్ని కుండం లేకుండా ఉండాలి. మిగతా అన్ని "బహాయీ" గుడుల వలే ఢిల్లీ "లోటస్ టెంపుల్" కూడా ఈ ప్రకారమే నిర్మించబడింది.
ఈ కట్టడానికి ప్రేరణ "పద్మము".27 పాల రాయి పలకలని పద్మ రేకులుగా చెక్కారు.ఈ రేకులని మూడు మూడు చొప్పున కలపడంతో 9 వ్రుత్తాకార భుజాలు ఏర్పడ్డాయి. ఈ కట్టడానికి 9 ద్వారాలున్నాయి, ఏ ద్వారం నుండి ప్రవేశించినా మధ్య హాలు లోకే వస్తాము. ఈ హాలు లో ఒకేసారి పాతిక వేలమంది కూర్చోవచ్చు.
26 ఎకరాల స్థలం లో,40 మీటర్ల పొడవుగల ఈ హాలు చుట్టూ 9 కొలనులు, మరి కొన్ని ఉద్యాన వనాలున్నాయి.ఈ శిల్ప కళా వైభవం వల్ల దీనికి అనేక అవార్డులతో పాటు లెక్కకు మిక్కిలి టీవీ కార్యక్రమాలు,పుస్తకాలు, పేపర్లలో ఈ లోటస్ టెంపుల్ ప్రస్తావించబడింది. భారత దేశం ఈ కట్టడం చిహ్నం గా ఒక తపాలా బిళ్ళ కూడా విడుదల చేసింది. 2011 సంవత్సరానికి గాను ఎక్కువ మంది దర్శించే ప్రార్ధనా మందిరం గా గిన్నీస్ పుటలక్కెక్కింది.