హయత్ బక్ష్ బాగ్ ఎర్ర కోట చుట్టు పక్కల గల ఉద్యానవనాలలో అతి పెద్దది. దీనిని మొఘలులు పశ్చిమ ఆసియా దేసాల కట్టడాలని చూసి ప్రేరేపించబడి నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సుందర ఉద్యాన వనం లో ట్యాంకులు,మంటపాలు,నీటి కాలువలు, ఫౌంటెన్లున్నాయి. ఛారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఉద్యానవనం లో నీలం,తెలుపు, ఊదా రంఫు పూల చెట్లు మొదట నాటబడ్డాయి. షా బుర్జ్ గా పిలవబడే ఒక బురుజు ఈ ఉద్యాన వన ఈశాన్య భాగం లో ఉన్నది. ఈ బురుజు పైకప్పు 1857 సిపాయిల తిరుగుబాటు లో ధ్వంసమయ్యింది. ఈ బురుజు ని పోలి ఉండే “అసద్ బురుజు” కోట ఆగ్నేయ భాగం లో అమర్చబడినది
హయత్ బక్ష్ బగ్ కి ఇరుపక్కలా తెల్లటి పాలరాతితో నిర్మించబడ్డ “సావన్”,”భడన్” మంటపాలున్నాయి.ఈ మంటపాల పేర్లు హిందూ క్యాలెండరు లో గల వర్షాకాల నెలలనుండి ఉధ్భవించాయి. “సావన్” మంటపానికి ఇరుపక్కలా చెక్కబడ్డ కొవ్వోత్తుల రూపాలు ఈ మంటపానికి ఒక ప్రత్యేక ఆకర్షణ
మోతీమహల్,హీరా మహల్,జాఫర్ మహలులు కూడా ఈ హయత్ బక్ష్ బాగ్ లోని భాగాలే. కాని మోతీ మహలు సిపాయిల తిరుగుబాటు కాలం లో ధ్వంసం అయ్యింది. ఎర్ర కోట కి చుట్టుపక్కల “నగర్ ఖానా”,”దివన్-ఈ-ఆం”,”దివన్-ఈ-ఖాస్”,”రంగ్ మహల్”,”ఖాస్ మహల్”,”ముంతాజ్ మహల్” కూడా చూడదగ్గ ప్రదేశాలు.