ఇస్కాన్ దేవాలయం, శ్రీ రాధా పార్థసారథి మందిరంగా కూడ పిలిచే న్యూఢిల్లీ లోని రాధాకృష్ణుల ప్రసిద్ధ ఆలయం. తూర్పు న్యూ డిల్లి కైలాష్ ప్రాంతంలోని అందమైన పచ్చని హరే కృష్ణ కొండల పైన ఉన్న ఈ దేవాలయాన్ని 1998 లో స్థాపించారు.
శ్రీ రాధా పార్థసారథి మందిరాన్ని అచ్యుత్ కన్విండే అనే వ్యక్తి రూపకల్పన చేసి నిర్మించారు, దేశంలోని అతి పెద్ద దేవాలయ ప్రాంగణాలలో ఈ ప్రత్యేక మందిరం ఒకటి. నాల్గు పెద్ద విభాగాలుగా విభజించబడిన, ఈ ప్రాంగణంలో పరిపాలన కోసం ఉపయోగించే అనేక సభామందిరాలతో బాటు దేవాలయ పూజారులకు, సేవ చేయడానికి అనేక గదులు కూడా ఉన్నాయి.
అన్ని ఇస్కాన్ దేవాలయాలు అత్యుత్తమఅత్యుత్తమ పూజా ప్రమాణాలను పాటిస్తాయి, కొన్ని క్రతువులను రోజువారీగా నిర్వహిస్తారు. ఆరు వేర్వేరు రకాల ఆరతులు, ఆరు రకాల వంటలు లేదా నైవేద్యాలు, ఆధ్యాత్మిక నిబంధనల మేరకు పూజరులచే దేవతలకు ఖచ్చితమైన పూజ వంటివి కొన్ని వీటిలో ఇమిడి ఉన్నాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి, గౌర పూర్ణిమ, రామ నవమి, గోవర్ధన పూజ, రాధాష్టమి వంటి పండుగలు కూడా అన్ని ఇతర ఇస్కాన్ దేవాలయాలతో బాటుగా ఇక్కడ కూడా నిర్వహిస్తారు.
ఢిల్లీ లోని ఏ ప్రాంతం నుండైన సులువుగా చేరగలిగే ఈ దేవాలయం ప్రతి రోజు ఉదయం 4.30 నుండి రాత్రి 9.15 వరకు తెరిచి ఉంటుంది.