జామా మసీదు భారతదెశం లోని పురాతన మశీదులలో ఒకటి. దీనిని షాజహాను నిర్మించాడు. ఇది ఆ మొఘలు చక్రవర్తి చే నిర్మించ బడ్డ ఆఖరి వాస్తు నిర్మాణం. దీనిని 1650 లో మొదలుపెట్టి ఆరు సంవత్సరాల తరువాత అనగా 1656 లో పూర్తిచేసారు. చౌడీ బజార్ లో గల ఈ మసీదు పాత ఢిల్లీ లో గల దర్శనీయ స్థలాలలో ముఖ్యమైనది.
ఈ మశీదు ని మొదట "మస్జిద్-ఈ-జహాన్-నుమా" అని పిలిచేవారు. "మస్జిద్-ఈ-జహాన్-నుమా" అనగా మశీదు ని ప్రతిబింబించే ప్రపంచం అని అర్ధంట. తరువాత ముస్లిం మతస్తుల మధ్యాహ్న ప్రార్ధనలైన "జామా" పేరు మీద ఇది "జామా మశీదు" గా మారింది.
ఒకేసారి పాతికవేలమంది కూర్చుని ప్రార్ధించే స్థలం ఉంది ఈ మశీదులో. ఈ మశీదు కి మూడు ద్వారాలు,40 మీటర్ల ఎత్తుతో తెల్ల పాలరాయి మరియు ఎర్ర ఇసుకరాయితో చేసిన నాలుగు స్తంభాలు గల టవర్లున్నయి. ఇంకా హిందూ జైన వాస్తు శాస్త్ర ఆధారం గా అత్యద్భుతం గా చెక్కబడిన 260 స్తంభాలున్నయి.
ఈ మశీదు నేల తెలుపు మరియు నలుపు మార్బుల్ తో ముస్లిం మతస్తులు కూర్చుని ప్రార్ధించే వస్త్రాన్ని పోలి ఉంటుంది. ఐదడుగుల ప్లాట్ఫారం మీద నిలిచి ఉన్న ఈ అందమైన మశీదు భారత దేశ మసీదులలోకెల్ల పెద్దది.
ఈ మశీదులో అనేక ప్రాచీన చిహ్నాలున్నాయి. వాటిలో జింక చర్మం మీద రాయబడ్డ పురాతన పవిత్ర ఖురాను ప్రతి ముఖ్యమైనది. ఈ మశీదు ఉత్తర ద్వారం వద్ద అమర్చబడింది. జామా మశీదు ఎర్ర కోట కి ఎదురుగా ఉన్నది.