ఢిల్లీ నెహ్రూ ప్లేస్ లో గల కల్కాజి గుడి అత్యంత పూజ్యమైనది. చాలా మంది భక్తులు దర్శించే ఈ దేవాలయం చాలా పురాతనమైనది.ఇక్కడి ముఖ్య దేవత దుర్గా మాత అవతారమైన కాళికా దేవి.ఈ గుడినే "మనోకమ్మ సిద్ధపీఠ్" అని కూడా పిలుస్తారు,అనగా భక్తుల కోరికలు తీరే స్థలం అని.
ఈ గుడి వెనక ఆసక్తికరమైన గాధ దాగి ఉంది.దేవతలని రాక్షసుల బారి నుండి కాపాడటానికి పార్వతీ దేవి పుత్రికగా జన్మించిన కాళికా మాత ఇక్కడ నివసించడంతో ఈ గుడి వెలిసింది అని చెపుతారు.
మొట్ట మొదట ఇటుకలతో నిర్మించబడిన ఈ గుడి కి ఇప్పుడు మార్బల్ తాపడం చేసారు. ఈ గుడీ చుట్టూ పిరమిడ్ టవర్ ఉంది.గర్భాలయం లోకి మార్బుల్ రాయి పరచబడ్డ 12 ప్రవేశద్వారాలున్నాయి.గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న మంటపంలో 36 వంపులు గల ద్వారాలున్నాయి. నిత్యం పూజలు జరుతున్నాగానీ నవరాత్రులలో ఈ గుడీ ఒక సరికొత్త శొభ ని సంతరించుకుంటుంది.ఉత్సవాలు జరిగే సమయం లో భక్తులు ఇక్కడ గుమిగూడి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తారు.సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.ఈ గుడి కి దగ్గరలోనే ఇస్కాన్ గుడీ మరియు లోటస్ టెంపుల్ ఉన్నాయి