2004 లో ఢిల్లీ అభివ్రుద్ధి సంస్థ చే నిర్మించబడిన మిలీనియుం ఇంద్రప్రస్థ పార్కు మన ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపాలనుకేవారికి చక్కని ప్రదేశం. ఈ పార్కు తూర్పు ఢిల్లీ ఔటర్ రింగు రోడ్డు మీద ఉన్నది. ఈ పార్కుని స్మ్రుతి వనం,ఫ్రాగ్రంట్ వనం(సుగంధ వనం), బోగన్ విలియా వనం,టొపియారీ వనం మరియు ఫోలియేజ్ వనాలుగా విభజించారు. ఈ పార్కులోనే 2007 లో దలైలామా, ఇతర బౌద్ధ సన్యాసుల విగ్రహాలు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు చే ఆవిష్కరించబడ్డ ప్రపంచ శాంతి స్థూపం కూడా ఉంది.
ఇంద్రప్రస్త పార్కు లో ని పచ్చదనం, పరిశుభ్రమైన గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పార్కులో ఆరుబయట నిర్మించబడ్డ సభా మంటపం,ఫుడ్ కోర్టు,జలపాతం,నయనాదంకరమైన ప్రక్రుతి మిమ్మల్ని ఇక్కడే ఉండి సేద తీరేలా చేస్తాయి. ఈ పార్కు లో నుండి కనపడే హుమాయూన్ సమాధి దగ్గరలోని మరొక దర్శనీయ స్థలం.
ఈ పార్కు ని సందర్శకుల కొరకు రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంచుతారు.