నిజాముద్దీన్ దర్గా సందర్శించదగిన ఒక ప్రసిద్ధ ఆకర్షణే కాక ఎంతో ప్రసిద్ది చెందిన ఒక సూఫీ సన్యాసి నిజాముద్దీన్ ఔలియా సమాధి కూడ. ఢిల్లీ లోని నిజాముద్దీన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇది ప్రతి ఏడాది వేలాదిమంది ముస్లిం యాత్రికులను ఆకర్షించడమే కాక అన్ని ఇతర మతాల ప్రజలు ఇక్కడకు విచ్చేస్తారు.
నిజాముద్దీన్ దర్గా ప్రాంగణంలో ఇనాయత్ ఖాన్, మొఘల్ యువరాణి జహానారా బేగం, ప్రసిద్ధ కవి అమీర్ ఖుస్రో సమాధులు ఉన్నాయి. ఈ ప్రాంగణంతో బాటుగా పరిసరాలు కూడా సమానంగా ప్రసిద్ది చెందాయి. తూర్పు నిజాముద్దీన్, పశ్చిమ నిజాముద్దీన్ గా విభజించబడి, పశ్చిమ ప్రాంతంలో దర్గా ప్రాంగణం, ముస్లిం విక్రేతల ఆధిపత్యం ఉన్న మార్కెట్, తూర్పు ప్రాంతంలో ఉన్నత వర్గీయులు నివసించే ప్రదేశం ఉన్నాయి.
ఈ ప్రాంతం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, హుమాయూన్ సమాధుల మధ్య ఉంది.