తూర్పు ఢిల్లీ లో ఒక కృష్ణుడి దేవాలయం కలదు. దీనినే శ్రీ ఉత్తర గురువయూరప్పాన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ మయూర్ విహార్ లో కలదు. దీనిని 1983 సంవత్సరంలో నిర్మించారు. ఢిల్లీ వాసులు , చుట్టుపక్కల వారు ఇక్కడకు తరచుగా వస్తారు.
ఈ గుడిని చాలా వరకు కేరళ లోని శ్రీ కృష్ణ టెంపుల్ తీరు లో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ చాంద్రమాన పద్ధతి లో కొన్ని ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ దేవాలయం మతపర వేడుకలే గాక కొన్ని సమాజ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తుంది. ఒక హాస్పిటల్, విద్యా సంస్థ , ఆడిటోరియం వంటివి కూడా నడుపుతుంది. పూజలు, ఆడిటోరియం వంటివి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.