ప్రసిద్ధ దేఒఘర్ హిందూ మత తీర్ధయాత్ర బైద్యనాథ్ ధామ్ గా ప్రాచుర్యం పొందినది. ఇది ఒక ప్రసిద్ధి చెందిన ఆరోగ్య రిసార్ట్. దేఒఘర్ కదిలే భూభాగంపై ఉంది. దాని చుట్టూ అరణ్యాలు మరియు చిన్న గుట్టలు ఉన్నాయి.
దేఒఘర్ వద్ద ప్రధాన ఆలయ సముదాయంలో 22 దేవాలయాలు ఉన్నాయి. అంతేకాక భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉంది. వేలాదిమంది భక్తులు శ్రావణ మాసంలో శివుడు ఆరాధించటానికి బాబా బైద్యనాథ్ పురాతన ఆలయంను సందర్శిస్తారు. అనేక మంది భక్తులు సుల్తాన్గంజ్ ఆలయం నుండి ప్రారంబించి 100 kms నడిచి బసుఖినాథ్ పుణ్యక్షేత్రం సందర్శనతో పూర్తి చేస్తారు. హిందూ మత భక్తులకు ఈ జ్యోతిర్లింగం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంతేకాక దేఒఘర్ దేవతల కేంద్రంగా పరిగణించబడుతుంది.
దేఒఘర్ సమీపంలో యమునజోర్ మరియు దారు అనే రెండు నదులు ప్రవహిస్తున్నాయి. దేఒఘర్ దేవాలయాల నగరం అని ప్రజాదరణ పొందినది. ఈ ప్రదేశం మంచి వాతావరణం,అత్యద్భుతమైన అందం మరియు ఆరోగ్య పర్యాటక దృక్కోణంనకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంటుంది.
దేఒఘర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు
ప్రధాన పర్యాటక ఆకర్షణగా బైద్యనాథ్ దేవాలయం ఉన్నది. ఇతర పర్యాటక ఆకర్షణలుగా రామకృష్ణ మిషన్ విద్యాపీట్,త్రికుట్,సత్సంగ్ ఆశ్రమం,నవలోఖా ఆలయం,శ్రావణి మేళ,శివగంగ,దేవసంఘ మఠం ఉన్నాయి. నందన్ పహార్ అనే అందమైన కొండలు ఒక ప్రజాదరణ పొందిన ఒక పిక్నిక్ స్పాట్ గా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఒక నంది ఆలయం కూడా ఉన్నది.
దేఒఘర్ వాతావరణము
దేఒఘర్ వాతావరణం పొడిగా ఉంటుంది.వేసవికాలాలు ఎక్కువ ఉష్ణోగ్రతలు కలిగివుంటాయి కానీ ఎక్కువగా వాతావరణము ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.
దేఒఘర్ చేరుకోవడం ఎలా
సమీప విమానాశ్రయం పాట్నాలో ఉన్నది. ఇది భారతదేశం యొక్క ఇతర ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంటుంది. దేఒఘర్ సందర్శించడానికి ఉత్తమ సమయం పవిత్రమైన శ్రావణ మాసం ఆ తరువాత అక్టోబరు నుంచి ఫిబ్రవరి మరియు జూలై నుండి ఆగస్టు వరకు ఉంటుంది.
సమీప రైల్వే స్టేషన్ బైద్యనాథ్ ధామ్ మరియు జసిదిహ్ ప్రధాన రైల్వే జంక్షన్. ఇది హౌరా పాట్నా ఢిల్లీ లైన్ లో ఉంది. రోజువారీ పాసింజర్ రైళ్లు సమీప నగరాలకు ఉన్నాయి.