దేవరాయనదుర్గ గ్రామంలో ప్రయాణం చేసేటపుడు, కొండకింద ఉన్న భోగనరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్సించాలి. చోళుల కాలంలో ఈ యాత్రాస్థలం నిర్మించబడింది. ఈ ప్రదేశం చేరిన తరువాత, ప్రయాణీకులు లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
భోగనరసింహస్వామి విగ్రహం శివుడి అవతారంగా భావించే దుర్వాస మహా ముని చేత ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు మైసూర్ రాజులకు “ఇలవేల్పు” గా నమ్ముతారు.
దేశం అంతట నించి వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రసిద్ధ రథోత్సవం (జాతర) సమయంలో భోగనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ రథోత్సవం మార్చ్/ఏప్రిల్ మాసంలో వచ్చే ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజు జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా, శ్రీ భోగనరసింహ స్వామి రధం లేక వాహనం ప్రధాన రథ వీధి గుండా తీసుకువెళతారు.