సమయం ఉంటె, పర్యాటకులు కొండ మొదట్లో ఉన్న నామద చిలుమే (చిలుమే అంటే బుగ్గ)ను చూసి తీరాలి. నామద చిలుమే, జయమంగలి నది పుట్టుకగా చెప్పబడుతుంది. శ్రీరాముడు లంకకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగాడని జానపదుల కధనం.
రాముడు నామాన్ని(నుదుటిపైన హిందువులు పెట్టే ఒక బొట్టు) దిద్దుకోవడానికి నీరు అవసరం అయింది. అక్కడ నీరు దొరకకపోవడంతో, రాముడు నేలమీద బాణాన్ని సంధించిన ఫలితంగా ఈ బుగ్గ నుంచి నీరు ఉబికింది. ఈ ప్రదేశం రాముడి నామం కోసం ఏర్పడింది కనుక దీనికి నామద చిలుమే అని పేరు పెట్టారు. పర్యాటకులు ఈ బుగ్గ చేరువలో రాముని పాదాల ముద్రలు కూడా చూడవచ్చు.
నామద చిలుమే ఎదురుగా 1931వ సంవత్సరంలో నిర్మించిన ఒక పాత అతిథిగృహం కనిపిస్తుంది. ప్రఖ్యాత పక్షిశాస్త్రగ్నుడైన డాక్టర్ సలీం ఆలీ తన పరిశోధన నిమిత్తం 1938 లో ఈ అతిథి గృహంలో నివసించారని చెప్తారు.