పల్లివాసల్ జలపాతాలు చిన్నవే అయినప్పటికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి దేవి కులంలో సీతా దేవి సరస్సుకు సమీపంలో కలవు. ఈ జలపాతాల ప్రదేశం నగర బిజీ జీవితాలు గడిపే వారికి ఆహ్లాదం కలిగిస్తూ ఒక మంచి విహార స్ధలంగా ఉంటుంది. పర్యాటకులు ఈ ప్రదేశంలో మానసికంగాను, శారీరకంగాను ఆహ్లాదాన్ని పొందవచ్చు.
పల్లివాసల్ ఇడుక్కి జిల్లాలో ఒక గ్రామం. ఈ ప్రదేశంలో రకేరళ లోని మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ గ్రామానికి మున్నార్ నుండి తేలికగా చేరవచ్చు. మున్నారు నుండి 8 కి.మీ. ల దూరం మాత్రమే కలదు. పర్యాటకులు, సీతాదేవి సరస్సు, పల్లి వాసల్ జలపాతాలు ఒకే సారి ప్రణాళిక చేసుకోవచ్చు.