కమలేశ్వరీ మందిరం కాళీ మాతకు అంకితం చేయబడింది. ఇది కమల్పూర్ అని పిలిచే త్రిపుర లోని అతిపెద్ద ఉప-విభాజక పట్టణంలో ఉంది. ఈ పట్టణం ధాలై జిల్లా ప్రధానకార్యాలయం అంబస్స నుండి షుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కమలేశ్వరీ మందిరం అగర్తలా నుండి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కాళీ మాతకు మరోపేరు కమలేశ్వరీ, అందువల్ల ఈ ఆలయానికి ఈ పేరు పెట్టారు. కమల్పూర్ పట్టణం నుండి ఈ ఆలయానికి ఆ పేరుపెట్టారు. ఈ ఆలయానికి ఎడాదిపొడవునా తరచుగా భక్తులు వస్తారు. అయితే, సెప్టెంబర్, మే మాసాలలో కమలేశ్వరీ మందిర్ ని సందర్శించడానికి సరైన సమయం, ఎందుకంటే వర్షాలు తగ్గి ఆలయాన్ని తేలికగా సందర్శించడానికి వీలుగా ఉంటుంది.
పర్యాటకులు అద్దె టాక్సీలలు అగర్తలా నుండి నేరుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అమ్బస్సా వరకు, తరువాత కమల్పూర్ కి బస్సులు కూడా ఉంటాయి. కమల్పూర్ లో రైల్వే స్టేషన్ లేదు, అగర్తలా లో సమీప రైలుకేంద్రం ఉంది. సమీప విమానాశ్రయం కూడా అగర్తలా లో ఉంది.