1891 లో కాథలిక్ చర్చ్ ని నిర్మించారు. ఈ చర్చ్ అసలు భవనం 1897 భూకంపంలో పాడైపోయింది, తరువాత తిరిగి పునర్నిర్మించబడింది. ఈ చర్చ్ ని పవిత్ర రోజరీ చర్చ్ గా కూడా పిలుస్తారు. శుక్రవారం నాడు ఈ చర్చ్ అభ్యాసకులు, చూపరులతో ప్రత్యెక ఆకర్షణను సంతరించుకుని ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్ లో నిర్వహించే క్రైస్తవ అద్భుత సంబరాలతోపాటు, ప్రతి ఏటా అక్టోబర్ 7 న ప్రజలు పాల్గొనే “ఆనంద మేళా” అనే మరో ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు.