తమిళనాడు లోని ధర్మపురి జిల్లాలో కరి మంగళం ఒక చిన్న పట్టణం. పట్టణం చిన్నది అయినప్పటికీ, తమిళ్ నాడు సంస్కృతిలో విశేషమైన చరిత్ర కలిగి వుంది. ఈ పట్టణంలో అనేక దేవాలయాలు కలవు వీటిని ఇక్కడి మునిసిపల్ అధికారులు నిర్వహిస్తారు. ఈ టవున్ లో ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా కలదు. ఈ టవున్ పురాణ కాలం నాటిదని చెపుతారు. తమిళ సంస్కృతి లో ఈ ప్రదేశం విశేష స్థానాన్ని కలిగి వుంది. ప్రఖ్యాత రచయితలు ఈ ప్రదేశాన్ని ఎన్నో మత గ్రంధాలలో పేర్కొన్నారు. ఇక్కడ అనేక మంది సాధువులు, గొప్ప ఋషులు జన్మించారు. ఇక్కడి భూమి సారవంతమైనది. సంవత్సరం పొడవునా అంటే ఏప్రిల్ మరియు మే నెలల కూడా చల్లగా వుంటుంది. వేలాది భక్తులు ఇక్కడి దేముడి ఆశీర్వాదం కొరకు వస్తారు.