ధర్మస్ధల వెళ్ళే యాత్రికులు అన్నప్ప బెట్ట కూడా చూడవచ్చు. దీనినే బడినేడి బెట్ట అని కూడా అంటారు. ఇది ధర్మస్ధలలో ఒక కొండ. ఇక్కడ ధర్మ దేవతల నాలుగు మందిరాలుంటాయి. ఈ మందిరాలను చేరగానే యాత్రికులకు వాటిలో దేవతా విగ్రహాలు కనపడవు. ప్రధానంగా ఈ ప్రదేశానికి పిల్లలు, మరియు మహిళలు అనుమతించబడరు. ప్రజల కధనం మేరకు జైనుల కుటుంబాల సాంఘిక సేవలకు మెచ్చి అన్నప్ప బెట్ట ను నలుగురు ధర్మ దేవతలు అక్కడకు వచ్చారని చెపుతారు.