ఇక్కడకు వచ్చిన పర్యాటకులు చంద్రనాధ స్వామి మందిరాన్ని తప్పక చూడాలి. దీనిలో చంద్రనాధ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ జైన మందిరం అద్భుత శిల్ప కళ కలిగి ఉంటుంది. దీనిని నెలయాడి బీడు జైనుల గురువు బిర్మన్న పెర్గడే కనుగొన్నారు. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకోవాలనుకునేవారికి చంద్రనాధ స్వామి మందిరం ఎంతో అనుకూల వాతావరణంగా ఉంటుంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి చంద్రనాధ స్వామికి ప్రార్ధన చేస్తారు. ఈ ప్రదేశం సందర్శించే పర్యాటకులు అందమైన శిల్పాలను దర్శించగలరు. ఈ మందిరం దిగంబరుడి యొక్క పవిత్ర స్ధలంగా పరిగణిస్తారు. ఈ కట్టడానికి పెంకుల మిద్దె ఉంటుంది. అది నలుగురు దేవతలకు నిలయం. చంద్రనాధ స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గం.లు మరియు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల మద్య మాత్రమే దర్శనం పొందగలరు.