ధర్మస్ధల సందర్శించే యాత్రికులు రత్నగిరి కొండకు పడమటి భాగాన గల ధర్మస్ధల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రిందట, జైనుల మతగురువు బ్రిమన్న పెర్గాడెం నిర్మించారు. ధర్మస్ధల దేవాలయంలో శివ భగవానుడి బంగారు లింగం ఉంది. శివ భగవానుడి అవతారమే శ్రీ మంజునాధేశ్వర అన్నప్ప స్వామిగా చెపుతారు. ఈ దేవాలయంలో ఈయన ప్రధాన దైవం. ఈ యాత్రా స్ధలంలోని లింగం మంగుళూరుకు సమీపంలోని కద్రి నుండి తీసుకొనబడింది. ఈ ప్రదేశం చేరగానే ప్రయాణీకులు లింగం పక్కనే ఉన్న నరసింహ సాలిగ్రామ అంటే శ్రీ మహావిష్ణువు అవతారం ను దర్శిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మహా గణపతి, అమ్మవారు అమ్మనవారు లేదా పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయంలో నలుగురు ధర్మ దైవ విగ్రహాలు (ఆత్మల ధర్మాలను సంరక్షించేవి) అంటే కన్యకుమారి, కళార్ కయి, కాలరాహు, మరియు కుమారస్వామి కూడా ఉంటాయి. కేరళలోని ఇతర దేవాలయాలలో వలే, ధర్మస్ధల దేవాలయం లోపల కూడా చెక్కతో నిర్మాణాలు చేశారు. ఇక్కడి విశేషత అంటే ఈ దేవాలయం జైనులచే నిర్వహించబడుతుంది. హిందూ మధ్వ పూజారులచే పూజలు నిర్వహించబడతాయి. భక్తులు ధర్మస్ధల దేవాలయాన్ని ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు దర్శించవచ్చు.