ధర్మస్ధల చరిత్ర తెలుసుకొనగోరే సందర్శకులకు మంజూషా మ్యూజియం తప్పక సూచించదగినది. ఇది మంజునాధ దేవాలయానికి దక్షిణంగా ఉంది. ఈ మ్యూజియానికి ధర్మస్ధల ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్గడే యజమానిగా ఉంటారు. ఈ మ్యూజియంలో కత్తులు, పురాతన కెమేరాలు, తాళపత్ర గ్రంధాలు, నగలు, మైసూర్ పెయింటింగ్ లు ఉంటాయి. ఇవే కాక మ్యూజియంలో పురాతన పుస్తకాలు ఆ దేవాలయ సమాచారాన్ని అందించేవి ఉంటాయి. యాత్రికులు ముంజూషా మ్యూజియం వెలుపల కల రధాలను కూడా చూడవచ్చు. ఈ రధాలను కర్నాటకలోని వివిద దేవాలయాలనుండి సేకరించారు. పర్యాటకులు మౌర్యుల కాలంనాటి టెర్రకోటా నాణేలు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో మరో పురాతన వస్తువు అంటే 300 సంవత్సరాలనాటి వీణ కలదు. ఇది విద్వాన్ వీణా శేషన్నకు చెందినది. మ్యూజియాన్ని ఉదయం 10 గం.నుండి 1 గం. వరకు మరల సాయంత్రం 4.30 గం. నుండి రాత్రి 9 గం వరకు చూడవచ్చు.