హిందువులకు కైలాష్ యాత్ర చాలా ప్రధానమైనది. ఈ యాత్రను ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో ఘత నుండి మొదలు పెడతారు. పూర్వం దీనిని ఘోష్ట నుండి కైలాష్ కుండ్ వరకు అనేవారు. ఈ కైలాష్ కుండ్ లోని నీరు చైనా లోని మానస సరోవరం లోని నీటి అంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైనది. మంచుతో గడ్డ కట్టిన ఈ నీటిలో వీరు స్నానాలు చేస్తారు. పాపాలు పోతాయని, కోరికలు ఫలిస్తాయని భావిస్తారు.