బరోడా, దుంగార్పూర్ నుండి 59 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాల గ్రామం. పూర్వం, ఈ ప్రాంత౦ వగద్ రాజధానిగా ఉ౦డేది. శైవ మతం, జైన మతం ఈ ప్రాంతంలో అనుసరించే ప్రధాన మతాలు. పర్యాటకులు ఈ గ్రామ ప్రధాన టాంక్ కు దగ్గర ఉన్న పురాతన శివాలయాన్ని చూడవచ్చు. సంవత్సరం మొత్తం అనేక మంది భక్తులు దర్శించే ఈ ఆలయం తెల్ల రాయితో నిర్మించబడింది. సందర్శకులు 1349 సంవత్సరానికి పూర్వపు శాసనాలున్న ‘కుండ్లి’ని కూడా చూడవచ్చు. ఈ గ్రామంలో జైన తీర్ధంకర పార్శ్వనాథ విగ్రహం ఉన్న పురాతన జైన ఆలయం ఉంది, ఈ మందిరాన్ని 1904 సంవత్ లో భట్టారాక్ దేవేంద్ర సూరి గుర్తించారు.