గలియకోట్ దుంగార్పూర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో మహి నది ఒడ్డుపై ఉన్న కుగ్రామం. ఈ గ్రామం, ఈ ప్రాంతాన్ని పాలించిన భిల్ సేనాపతి పేరిట ఈ గ్రామం ఏర్పడిందని స్థానికుల నమ్మకం. ఈ గ్రామం పార్మర్ రాజులకు, దుంగార్పూర్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. గలియకోట్ సయ్యద్ ఫకృద్దీన్ మందిరానికి ప్రసిద్ది చెందింది. ప్రఖ్యాత సాధువు సయ్యద్ ఫకృద్దీన్ గలియకోట్ గ్రామం లో సమాధి చేయబడ్డాడు. తెల్ల పాలరాయిని ఉపయోగించి నిర్మించిన ఈ పవిత్ర స్థలం ఈ ప్రాంత౦ లోని అధ్భుతమైన నిర్మాణ శైలికి సంకేత౦. యాత్రికులు ఈ మందిర గోపురం మీద క్లిష్టమైన నమూనాలను చూడవచ్చు. ప్రతి ఏటా మొహరం 27 వ రోజు జరిగే ‘ఉర్సు’ ఉత్సవ౦లో అనేకమంది దావూది బొహరా భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.పర్యాటకులు గలియా కోట్ లో విజయ మాతా దేవి ఆలయం, వసుంధరా దేవి ఆలయం, శీతలా మాత ఆలయం చూడవచ్చు.