ఈ ప్రదేశం లో శ్రీ కృష్ణుడు ఒక వేట గాని బాణం చేత కాలి పై గాయం చేయబడి తన అవతారం చాలిస్తాడు. ఈ టెంపుల్ ఆవరణ లో శ్రీ కృష్ణుని గుర్తుగా ఒక తులసి మొక్క కలదు. వేటగాడు, శ్రీ కృష్ణుని కదలికను ఒక జింక కదలికగా భావించి బాణం వేస్తాడు. ఇక్కడే శ్రీ కృష్ణుడి దేహాన్ని సమాధి చేసిన దేహోత్సర్గ్ తీర్థ్ అనబడే స్థలం కూడా కలదు. ఇక్కడ కల సోమ నాథ్ టెంపుల్ కు ఒక కిలో మీటర్ దూరం లో ఒక గుహ కలదు. శ్రీ కృష్ణుడి అవతార సమాప్తి తో బలరాముడు ఒక సర్ప రూపం లో ఈ గుహ లోకి వెళ్లి అదృశ్య మయ్యాడని చెపుతారు.