ద్వారకకు మరియు బెయ్ట్ ద్వారకా కు చేరే మార్గం లో సౌరాష్ట్ర తీరాన ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం ఉన్నది. ప్రపంచం లోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ దేవాలయం ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగానే కాకుండా ముఖ్య పర్యాటక ప్రదేశంగా కూడా ఉన్నది. ఈ ప్రదేశంలో ఒక భూగర్భగుడి ఉన్నది. ఈ దేవాలయం లో పెద్ద ఈశ్వరుని విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం చుట్టూ చూడచక్కని ఉద్యానవనం ఉంది. శివరాత్రి సమయాన ఈ దేవాలయం తప్పక దర్శించదగ్గది.