కొడివేరి డాం తమిళనాడు లోని అతి పెద్ద డాములలో ఒకటి. ఇది ఈరోడ్ జిల్లలో గోపిచేట్టిపాలయంలో ఉంది. దీనిని భవాని నది పై కట్టారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ఈరోడ్ పట్టణం నుండి ఇది కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డాం ను మైసూర్ మహారాజు పదిహేడవ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ప్రత్యేక ప్రాంతంలో ప్రాధమికంగా ఉత్పత్తి చేసే రెండు పంటలు వరి, చెరుకు. ఈ డాం విస్తారమైన భౌగోళిక ప్రాంతాన్ని కల్గి ఉన్నట్లుగా పరిగణించడమే కాక ఈ ప్రాంతమంతా డాం కారణంగా సారవంతమైనందున గొప్ప ప్రాముఖ్యతను కల్గి ఉంది.
ఈ ప్రాంత నీటి పారుదలకు డాం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. పైగా, అధికారిక యంత్రాంగం డాం మౌలిక వసతుల అభివృద్ధికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం పిల్లల కోసం ప్రత్యేక పార్కులతో పాటుగా విశ్రాంతి గదులను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. ఈ డాం ను సామాన్య ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.