ఆరావళి గోల్ఫ్ కోర్స్ ని 1966 లో స్థాపించారు. ఢిల్లీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్ ఫరీదాబాద్ లోనే మొట్టమొదటిది. గోల్ఫ్ కోర్సు భవనాన్ని ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ జోసెఫ్ అలెన్ స్టెయిన్ రూపొందించారు, కోర్సు లేదా గ్రౌండ్ ని USA నుండి వచ్చిన స్టీఫెన్ కే రూపొందించారు. ఈ ఆట ప్రణాళికలో 18 రంధ్రాలు ఉంటాయి. ఈ గోల్ఫ్ టోర్నమెంట్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారులు, ఔత్సాహికుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
ఇక్కడ గోల్ఫ్ మాత్రమే కాకుండా బిల్లియర్డ్స్ కూడా ఆడతారు. ఇక్కడ గోల్ఫ్ ఆటగాళ్ళు రాత్రిపూట ఇక్కడ ఉండడానికి కూడా విలాసవంతమైన గదుల సౌకర్యాలు ఉన్నాయి. భారతీయులు అలాగే ఇతరదేశాల వారు కూడా ఈ క్లబ్ లో సభ్యులుగా చేరవచ్చు.