ఫరీద్కోట్ నడిబొడ్డున ఉన్న రాజ్ మహల్, బిల్బార్ సింగ్ ఆధ్వర్యంలో మహారాజ విక్రమ సింగ్ పరిపాలనా సమయంలో నిర్మించబడింది. ఈ అందమైన భవనం ఫ్రెంచ్ నిర్మాణ కళను స్పూర్తిగా తీసుకుని గీసిన అద్భుతమైన గాజు నమూనాలను, స్తంభాలను ప్రదర్శిస్తుంది. పూర్వం, ఈ మహలు రాచ కుటుంబీకులకు నిలయంగా ఉంది. ప్రస్తుతం, ఇది మహారాజ విక్రమ సింగ్ వారసులకు నివాసంగా ఉంది. ఈ మహలు పచ్చిక బయళ్ళతో, అందంగా రూపొందించిన స్తంభాలతో 15 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ఈ భావన గోడలు పురాతన చిత్రాలతో అలంకరించబడి చూసే ప్రతివారి మెప్పు పొందింది. ప్రవేశ ద్వారం ‘రాజ్ దేవోరి’, బల్బీర్ హాస్పిటల్ గా పేరుపొందిన ఒక హాస్పిటల్ కి వారసత్వ భవనంగా ఉంది.