గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ సిర్హిండ్ - మొరిండ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం లోనే 1704 లో గురు గోవింద్ సింగ్ జి కుమారులు ఇరువురిని వారు ముస్లిం మతం తీసుకోనందుకు అప్పటి ముస్లిం పాలకులు వారిని ఇక్కడ సజీవ సమాధి చేసారు. వారి గుర్తుగా ఇక్కడ ఒక గురుద్వారా నిర్మించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ మృత వీరుల దినోత్సవం అతి వైభవంగా నిర్వహిస్తారు.