హవేలీ తోదర్ మల్ భవనం గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ ఆవరణలో కలదు. దీనిని 17 వ శతాబ్దం లో నిర్మించారు. అపుడు జహాజ్ మహల్ లేదా జహాజ్ హవేలీ అని పిలిచేవారు. తోదర్ మల్ సిర్హిండ్ పాలకుడు నవాబ్ వజీర్ ఖాన్ కోర్టులో దివాన్ గా ఉండేవాడు. ఈయన గురు గోవింద్ సింగ్ జి కుమారుల సమాధులకు భూమి సేకరించాడు. అతని గౌరవార్ధం ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. అందమైన ఫౌంటెన్ లు, కొలనులు వుంది ఈ భవనం అద్భుత శిల్ప శైలి కలిగి వుంటుంది.