బులంద్ దర్వాజా లేదా “ గొప్ప ద్వారాన్ని” 17 వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన రాతి నిర్మాణం సాధారణ పర్షియన్-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్ సిక్రీ నగరానికి ఉత్తర ద్వారంగా ఉంది. బులంద్ దర్వాజా పై పర్షియన్ భాషలో 1601 లో గుజరాత్ పై అక్బర్ విజయాన్ని తెలియజేసే శాసనం ఒకటి ఉంది. ద్వారం పై ఉన్న ఈ పర్షియన్ శాసనం అక్బర్ విశాలహృదయాన్ని తెలియజేస్తుంది. విభిన్న సంప్రదాయాలు, సంస్కృతుల ప్రాధాన్యతను చాటి చెప్పిన ఉదాహరణగా దీనిని చరిత్రకారులు తరచుగా ఉదాహరించేవారు. ఈ విశాలమైన, దృఢమైన ఇసుకరాయి నిర్మాణం అన్ని వైపులా ద్వారాలతో ఒక పెద్ద సమాధిని పోలి ఉంటుంది. ప్రశాంతమైన దృశ్యాలను, గోడలపై ఉన్న అందమైన కళను చూసి ఆనందించడానికి అనేక మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు.
బులంద్ దర్వాజాను ఎరుపు, పసుపు ఇసుక రాయితో నిర్మించి, తెలుపు, నలుపు చలువరాయితో లోపలి భాగాలను చెక్కారు. ఒక సౌష్టవమైన ప్రణాళికను కల్గిన అందమైన ఈ కోట బురుజు కట్టడంపైన స్తంభాలు, గొడుగులు ఉన్నాయి.