ఇబాదత్ ఖాన లేదా “ప్రార్ధనా మందిరం” ఫతేపూర్ సిక్రీ లోని తన భవనంలో అక్బర్ కట్టించిన ప్రార్ధన లేదా సమావేశ మందిరం. నిజానికి కేవలం సున్ని ముస్లిములు సమావేశమై అనేక విషయాలను చర్చించుకోవాలనేది అతని ఉద్దేశ్యం. అయితే, ఇతర మతాల శాఖల వారికి చిన్న చిన్న తేడాలు వచ్చి విశ్వాసకుల పరిస్థతి చేయి దాటి నప్పుడు అన్ని మతవిశ్వాసాలు వారి కోసం ఈ గదిని తెరవాలని నిర్ణయించుకొన్నాడు. నగరంలోని స్థానికులు, సందర్శకులు తరచూ చర్చించేందుకు, చర్చలలో పాల్గొనడానికి ఈ గదికి ఆహ్వానించేవారు.
అతని సామ్రాజ్యం లోని ధార్మిక నాయకులను, తత్వవేత్తలను, అటుగుండా వెళ్ళేవారిని ప్రతి గురువారం సాయంత్రం చర్చలలో పాల్గొనవలసినదిగా ప్రోత్సహించేవారు.
ధార్మిక పెద్దలు, తత్వవేత్తల మధ్య తేడాలతో విసుగు చెందిన అక్బర్ దీన్-ఏ-ఇలాహి లేదా ‘దివ్యమైన విశ్వాసం’ అనే ఒక కొత్త విశ్వాసం సృష్టించడం ద్వారా ఒక సయోధ్య కల్గించాలని ప్రయత్నించాడు. ఈ మెచ్చుకోదగిన ఒక కృషికి ప్రజానీకం నుండి స్పందన కరువైంది, కానీ అక్బర్ సభకి చెందిన కొన్ని ఉన్నత వర్గీయులకు చెందిన కొద్దిమంది మాత్ర౦ దీనిని అంగీకరించారు.