షేక్ సలీం చిష్తి సమాధి 16 శతాబ్దం ప్రారంభంలో కట్టిన అందమైన, అద్భుతమైన కట్టడం. ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్ అతనికి కుమారుడు జన్మిస్తాడని జోస్యం చెప్పిన సూఫీ సాధువు సలీం చిష్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సమాధిని నిర్మించాడు.
ఈ విశాలమైన తెలుపు నిర్మాణం ఒక అద్భుతమే కాక, ఈ రోజుకు కూడా మతాలూ, విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అన్ని రంగాల ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ అందమైన చతురస్రాకారపు చలువరాయి సమాధి భారతదేశంలోని మొఘల్ నిర్మాణశైలికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. బులంద్ దర్వాజాకి ఎదురుగా జానానా రౌజా దగ్గరలో ఈ సమాధి ఉంది. ఎత్తైన వేదికపై కట్టిన ఈ సమాధి గడపలోనికి ప్రవేశించడానికి ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది.