సట్లేజ్ నది ఒడ్డుపై ఉన్న ఫెరోజెపూర్, పంజాబ్ లోని అత్యంత ప్రసిద్ధ చారిత్రిక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరం తుగ్లక్ వంశ పాలకుడైన సుల్తాన్ ఫిరోజ్ షాహ్ తుగ్లక్ చే స్థాపించబడింది. ఈ ప్రదేశానికి భట్టి వంశ ప్రధాని ఫెరోజే ఖాన్ పేరుపెట్టబడిందని నమ్ముతారు. ఫెరోజెపూర్ లో చారిత్రక స్మారకలే కాకుండా, అనేక ధార్మిక మందిరాలు, సహజ ఆకర్షణలు కూడా ఉన్నాయి.
ఫెరోజెపూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
ఫెరోజెపూర్ పర్యటన నగరం మొత్తంలో ఉన్న అనేక ఆకర్షణల అంతంలేని అనేక దృశ్యాలకు ప్రసిద్ది చెందింది. జైన్ మందిరం, పోతిమల, గురుద్వారా గురుసర్ ఆశక్తికర పర్యాటక ప్రదేశాలలో కొన్ని అత్యంత ప్రధానమైనవి. ఇండో-పాక్ సరిహద్దుల తోపాటు ఉన్న ఈ నగరం, బ్రిటిష్ రాజ్, ఆంగ్లో-సిక్కుల యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఈ ప్రాంత చారిత్రిక వికాసాన్ని అందించే అనేక మ్యూజియంలు, స్మారకాలు ఉన్నాయి. ఆంగ్లో సిక్కుల యుద్ధ అమరకం, సరగార్హి స్మారకం. జాతీయ మర్తిర్స్ స్మారకం, బర్కి స్మారకం వంటి కొన్ని విలువలతో కూడిన ప్రదేశాలు ఉన్నాయి. వీటితోపాటు, పర్యాటకులు హరి పక్షుల అభయారణ్యం – 65 కిలోమీటర్ల దూరంలో ఉంది, గురుహర్సాహై వద్ద ఉన్న పోతిమల – 40 కిలోమీటర్ల దూరంలో ఉంది – ఫజిల్క లోని హనుమాన్ మందిరం – ఫెరోజెపూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఫెరోజెపూర్ చేరుకోవడం ఎలా
ఫెరోజెపూర్ కు సమీప విమానాశ్రయం దాదాపు 131 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్రిత్సర్ లో ఉంది, ఈ విమానాశ్రయం నుండి ప్రయాణీకులు అద్దె కాబ్ లలో లేదా బస్సులలో షుమారు రెండు గంటలలో ఫెరోజెపూర్ చేరుకుంటారు. అంతేకాకుండా, వసతులు అందించే ఫెరోజెపూర్ పర్యటన భారతదేశంలోని వివిధ నగరాలకు రైలు, రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
ఫెరోజెపూర్ సందర్శనకు ఉత్తమ సమయం
అక్టోబర్, డిసెంబర్ మధ్య ఫెరోజెపూర్ ను సందర్శించడం ఉత్తమం.